GNTR: దుగ్గిరాల(M) చిలువూరు వద్ద గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై రవి ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.8 కిలోల గంజాయి, ఒక స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.