ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాల నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని APSPDCL CMD శివశంకర్ లోతేటి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి హ్యాండ్ లూమ్స్కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చింది. సంస్థ పరిధిలోని 41 వేల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఏటా రూ.25.56 కోట్ల సబ్సిడీ భరిస్తోందని ఆయన తెలిపారు.