W.G: కేరళ మాదిరిగా విద్య, వైద్యం బాధ్యతను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకోవాలని పెంటపాడు సీపీఎం పార్టీ కన్వీనర్ రంగారావు డిమాండ్ చేశారు. శుక్రవారం పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.