నంద్యాలలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ జిల్లా సమావేశం శుక్రవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 11వ పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కమిషన్ నియమించాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు.