CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులకు వైసీపీ ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. మూడు రోజులకు ముందు ఆయన తన నివాసంలో ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తను పిలవకపోవడం, 2029లో పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి తానే అంటూ బహిరంగంగా ప్రకటించడం పార్టీ హై కమాండ్ దృష్టికి వచ్చింది.