కనిగిరిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా కాశిరెడ్డి కాలనీలోని హోసన్న కల్వరి కృప ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. యేసుక్రీస్తు చేసిన త్యాగం, నిస్వార్థ ప్రేమను స్మరించుకోవాల్సిన పవిత్ర దినమని తెలిపారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందాలని ఆకాంక్షించారు.