MNCL: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం బెల్లంపల్లి మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచే విధంగా చొరవ చూపాలన్నారు.