KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా బార్ కౌన్సిల్ బంజారా న్యాయవాదులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదుల సమస్యలు, స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. అనంతరం న్యాయవాదులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.