BHNG: ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చౌటుప్పల్ పురపాలక ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, ఆసుపత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతీ రోజు సగటున ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.