SDPT: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక శ్రీపట్టాభి రామాలయంలో ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాంతం స్వామివారి కృపతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లోకకల్యాణం కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.