BDK: మణుగూరు మండలం బట్టీల గుంపు గ్రామ పంచాయతీ సర్పంచ్ సరిత, అశ్వాపురం మండలానికి చెందిన పలు గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఇవాళ కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా MLA సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.