BDK: మణుగూరు మండలానికి చెందిన 14 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ పథకం అమలవుతోందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లభించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు స్థిర నివాసం కలగడంతో పాటు జీవన స్థితి మెరుగుపడుతుంది అని అన్నారు.