KMM: సింగరేణిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు, న్యూరో రిహాబ్ ఎడ్యుకేటర్ ఫౌండర్ డాక్టర్ బాదావత్ రవి ఆధ్వర్యంలో ‘మిషన్ వాక్’ స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కారేపల్లి, భాగ్యనగర్ తండా సర్పంచ్లు మేదరి వీర ప్రతాప్, బానోత్ హీరాలాల్ కలిసి ప్రారంభించారు.