MNCL: రాబోయే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తిరిగి తీసుకురావడం వరకు భద్రత కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.