NLG: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో 499 మంది లబ్ధిదారులకు రూ 1.78 కోట్ల సీఎంఆర్ఎఫ్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్లో త్వరలో 100 పడకల ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్ను ప్రారంభిస్తామన్నారు. కడపర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు.