CTR: వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో ఏప్రిల్ 14న డా. బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయవలసిందిగా గ్రామ పెద్దలు, యువకులు టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ మురళిని ఆహ్వానించారు. మోహన్ మురళి కార్యక్రమానికి తన వంతు సహకారంగా రూ. 10,000 విరాళం అందజేశారు.