NZB: నిజామాబాద్ సుభాష్ నగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన నూతన ఏసీబీ కార్యాలయాన్ని సీపీ సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో రేంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్పెక్టర్లు వేణుకుమార్, నగేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు.