NLG: పట్టణాల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై సిమెంట్ పరిశ్రమలు దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. ఇవాళ నల్గొండ, సూర్యాపేట జిల్లాల సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డులకు 100 కి.మీ పరిధిలో ఉన్న పరిశ్రమలు, తమ ఇంధన అవసరాల్లో కనీసం 6 శాతం RDFను వాడాలని సూచించారు.