ATP: కంబదూరు పాత ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని కాలి బిందెలతో ముట్టడించారు. కొంతకాలంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.