TPT: సామాజిక విప్లవకారుడు, వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి బిందేశ్వరి ప్రసాద్ (బీపీ) మండల్ వర్ధంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. సోమవారం స్థానిక డీబీఆర్ రోడ్డులోని మండల్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లను ప్రతిపాదించిన గొప్ప సంస్కర్త బీపీ మండల్ అని నాయకులు కొనియాడారు.