SKLM: గంగు వాడ గ్రామంలో ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ విఠల్ పాల్గొన్నారు.