KNR: యాదవ చైతన్య వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సైదాపూర్ మండలానికి చెందిన భాషవేని తిరుపతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.