GDWL: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అన్ని గ్రామ సభల్లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.