BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో MLA గండ్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు మంజూరు చేయడం లక్ష్యమని, డిసెంబర్ నాటికి 1937.21 కోట్లు అందించినట్లు MLA గండ్ర తెలిపారు. లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.