WGL: నర్సంపేట ఎట్టణంల బైక్ దంగలు రెచ్చిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఐదు, ఆరు బైకులు దొంగతనానికి గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. తాజాగా బస్టాండ్ సమీపంలోని కోర్టుగల్లీలో వాహనాలను పార్కింగ్ చేసి బ్యాంకుకు వెళ్లిన యజమానులు, తిరిగి వచ్చేసరికి తమ బైకులు కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు.