BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అరుంధతి నగర్లో సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న OHSR వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే నిర్మాణం నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.