NLG: మర్రిగూడలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు దోమల వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982 మార్చి 29న తెలుగు జాతి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని కొనియాడారు.