NZB: ఎడపల్లి మండలం అంబం(వై)కి చెందిన డప్పు మహేష్ (40) చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన మహేశ్ తిరిగి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. కాళ్లకు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు.