WGL: వేసవి నేపథ్యంలో WGL దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ను ఇవాళ మేయర్ గుండు సుధారాణి తనిఖీ చేశారు. నీటి శుద్ధి, క్లోరినేషన్ ప్రక్రియలను పరిశీలించి ల్యాబ్లో నమూనాలను పరీక్షించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.