కోనసీమ: అమలాపురం మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు పెరిగాయి. కిలో వంకాయ రూ.60, చిక్కుడు కాయలు రూ.100, పచ్చిమిర్చి రూ.60 పలుకుతున్నాయి. క్యారెట్ రూ.50, బీరకాయ రూ.60గా ఉన్నాయి. ఎండల తీవ్రతకు పంటలు దెబ్బతినడంతో ధరలు పెరిగాయని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.