కృష్ణా: మచిలీపట్నం మండలం పెద్దకరగ్రహారం, చిన్నకరగ్రహారం గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. 13 బ్లాకుల్లో సుమారు 16 వేల ఇళ్ల పట్టాలు కేటాయించినప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్ల సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.