VSP: సింహాచలం చందనోత్సవం విజయవంతంగా ముగియడంతో ఈవో జె. వెంకట్రావు సిబ్బందిని అభినందించారు. అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లే భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించగలిగామని తెలిపారు. ఇదే ఉత్సాహంతో గిరి ప్రదక్షిణను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.