AP: అనంతపురం హనీట్రాప్ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళలను ఎరగా వేసి కేటుగాళ్లు రూ.లక్షలు దోచుకుంటున్నారు. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురంలోని పలు స్టేషన్లలో హానీట్రాప్ బాధితులు ఫిర్యాదు చేశారు.