SKLM: ఓటర్ల జాబితా పారదర్శకతకు రాజకీయ పార్టీలు సహకరించాలని డీఆర్వో విశ్వేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో అత్యంత పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని అన్నారు.