SS: వైసీపీ క్రూరత్వానికి మరో బీసీ వ్యక్తి బలి అయ్యాడని మంత్రి సవిత ధ్వజమెత్తారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దస్తగిరిని అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు, ఇప్పుడు అతడిని ప్రాణాలతో బలి తీసుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం సొంత బాబాయిని, నమ్ముకున్న వారిని చంపడం జగన్ నైజమని విమర్శించారు.