ADB: నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మరణానికి కారణమైన శ్రీధర్ రెడ్డి, మధు సుదన్ రెడ్డి అనే నిందితులందరిపై మర్డర్ కేసు నమోదు చేయాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పసిపాపను చంపిన కులోన్మాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.