JGL: ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు షురూ అయ్యాయి. యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో అన్నదాతలు బిజీగా ఉన్నారు. ఇక రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టడానికి సరైన స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రధాన రహదారులపై ఎండబోస్తున్నారు. ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలాలు ఏర్పాటు చేయాలని, అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.