KMR: బిచ్కుంద మండలం పెద్ద దేవాడలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శోభ గంగాధర్ ప్రారంభించారు. ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపి కేంద్రంలోని ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, తదితరులు ఉన్నారు.