PDPL: ధర్మారం మండలం మేడారం పీహెచ్సీలో రేపు 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుస్మిత తెలిపారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. కావున మండలంలోని 15 సంవత్సరాల లోపు బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.