KDP: జిల్లా వ్యాప్తంగా జరిగిన ఓపెన్ ఇంటర్, పదవ తరగతి, పరీక్షల్లో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి విద్యార్థి నుండి రూ. 5,000 వసూలు చేశారని కోఆర్డినేటర్ సాంబశివా రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏఐబిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నాయక్ జిల్లా కలెక్టర్ను కోరారు.