ATP: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి సోమవారం ఉదయం అనంతపురం చేరుకుంటారు. అనంతరం యాడికిలో సీఎం చంద్రబాబు పాల్గొనే ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు.