PPM: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరామర్శించారు. ఆదివారం ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.