CTR: చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో బోయకొండ భక్త జనసంద్రమైంది. కొండపై వాహన రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కాగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.