రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ జోడీ యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని (బంతుల పరంగా) నెలకొల్పిన భారత జోడీగా వీరు అరుదైన రికార్డు సాధించారు. కేవలం 248 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో 2008లో ఢిల్లీ తరఫున సెహ్వాగ్-గంభీర్ (309 బంతులు) నెలకొల్పిన 18 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు.