NZB: కమ్మర్పల్లి మండలం కోన సముందర్లో సోమవారం సర్పంచ్ రాకేశ్ ఆధ్వర్యంలో వీధుల వారీగా దోమల మందు పిచికారి చేయించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామన్నారు. పరిసరాలను మాతో పాటు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.