నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్లలో గో-వృషభ కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సతీమణి డా.సరిత రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోపూజలో పాల్గొన్నారు.