PLD: సత్తెనపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తారకరామ సాగర్లో పూడికతీత పనులు ప్రారంభించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకం ఆపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసి, పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి బీమా కల్పిస్తుందన్నారు. చెరువులు బాగుచేసి భూగర్భ జలాలు పెంచాలన్నారు.