ATP: రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్ సహా తొమ్మిది మంది మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్తోంది. ఈ నెల 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు వీరు అక్కడ ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కఠినమైన షెడ్యూల్తో ఈ శిక్షణ సాగనుంది.