కృష్ణా: వీవోఏలు ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శనివారం చల్లపల్లిలోని వెలుగు కార్యాలయంలో మండలంలోని 37మంది వీవోఏలకు నూతన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి ఫోన్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.