ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చిట్టబ్బాయి శనివారం తెలిపారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.